Wednesday 4 May 2016

మశక దశన మధ్యే వారణా సంచరంతి" దోమ దంతాల మధ్య ఏనుగులు తిరుగాడు తున్నాయి శర్మ గారి పూరణ

0 comments
నాగఫణి శర్మగారి ద్విశతావ ధానం 1990 లో రవీంద్ర భారతిలో జరిగింది.అది చాలా చిన్నది చాల యిరుకు.
అప్పుడు ఒక సంస్కృత సమస్య యిచ్చారు.
"మశక దశన మధ్యే వారణా సంచరంతి" దోమ దంతాల మధ్య ఏనుగులు తిరుగాడు తున్నాయి
శర్మ గారి పూరణ

విపుల రహిత దేశే శ్రీ రవీంద్ర ప్రదేశే
ద్వి శత సుకవి మాన్యా: సంచరంతీతి చిత్రం
ఇద మద పరి దృశ్య ప్రౌడ విద్యా వదంతి
మశక దశన మధ్యే వారణా: సంచ రంతి

అర్థము:-- ఇరుకైన యీ రవీంద్ర భారతి లో పృచ్చకులుగా వచ్చిన 200 వందల మంది పండితులు అటూ యిటూ తిరుగాడుతున్నారు. .ఆ దృశ్య మెలా వుందంటే దోమ దంతాల మధ్య ఏనుగులు తిరుగాడు తున్నట్టు వుంది.చప్పట్లతో సభ మారు మ్రోగింది.
అప్పుడు ఏలూరిపాటి అనంతరామయ్యగారు .కానీ నాకు ఒకతను ఒక చీటీ
పంపించాడు.అయ్యా! మీరంతా అందరూ చప్పట్లు కొడుతున్నారని ఆనందిస్తున్నారు.కానీ ఇక్కడికి వచ్చిన వారిలో చాలా మంది కవితా రసాస్వాదనకోసం రాలేదు,ఈ భవనం లోని ఎయిర్ కండి షనింగు
యొక్క చల్లదనం ఆస్వాదించడాని కోసం వచ్చారని అంటే అవధాని గారి మనసు ఎలా వుంటుందో అడగండి.అన్నారు.
అప్పుడు సంచాలకులు బేతవోలు రామబ్రహ్మం గారు స్పందిస్తూ,యిప్పుడే అందిన సమాచారాన్ని బట్టి
యిక్కడ చల్లగా ఉంటుందని వస్తే యిక్కడ పాండిత్యపు తాలూకు వేడి యింకా వాడిగానూ,వేడిగానూ వుందని అనుకుంటూ వున్నారట.మరీ చప్పట్లు మారుమ్రోగాయి.

0 comments:

Post a Comment